For the best experience use Mini app app on your smartphone
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్‌ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యవస్థను ఇప్పటికే 10 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని, ఒక ఏడాదిలో లోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.
short by / 04:08 pm on 04 Dec
For the best experience use inshorts app on your smartphone