For the best experience use Mini app app on your smartphone
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరంలో అంజలి కార్తీక అనే 8 ఏళ్ల బాలిక ఇంటి వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందింది. చేతులు తడిగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్‌కి ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై ఆ చిన్నారి శుక్రవారం మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అంజలి స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
short by Sri Krishna / 12:23 pm on 27 Jul
For the best experience use inshorts app on your smartphone