For the best experience use Mini app app on your smartphone
దీపావళి వేడుకల్లో భాగంగా దేశంలోని చాలా చోట్ల ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పంటలకు నారాయణుడి విగ్రహంతో వివాహం జరిపిస్తారు. గోవాలో తెల్లవారకముందే భారీ ఆకారంలో నరకాసురుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, దహనం చేస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధామిలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లతో పరస్పరం దాడి చేసుకుంటారు. కర్ణాటకలోని గుమతాపురలో ప్రజలు పరస్పరం ఆవుపేడను చల్లుకుంటారు.
short by Devender Dapa / 08:37 pm on 20 Oct
For the best experience use inshorts app on your smartphone