For the best experience use Mini app app on your smartphone
నెల్లూరు జిల్లా బీవీ నగర్‌లోని నగరపాలక సంస్థ పాఠశాలలో స్లాబ్‌ కూలి 9వ తరగతి చదివే గురు మహేంద్ర అనే విద్యార్థి చనిపోయాడు. పాఠశాలలో నిర్మిస్తున్న నూతన భవనం కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా స్లాబ్‌ విరిగి పైన పడటంతో గురు మహేంద్ర మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై మంత్రి నారాయణ ఆదేశాలతో జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పారు.
short by Bikshapathi Macherla / 11:20 pm on 26 Jul
For the best experience use inshorts app on your smartphone