For the best experience use Mini app app on your smartphone
నంద్యాల జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారిపై టిప్పర్ అదుపుతప్పి ద్విచక్రవాహనంపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఎల్లా గౌడ్, రెహమాన్‌లకు తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కమెరాలో రికార్డు అయ్యాయి. వేగంగా వచ్చిన టిప్పర్, అదుపుతప్పి డివైడర్‌ను దాటి బైక్‌ను ఢీకొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలో పడిపోయింది. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.
short by Devender Dapa / 11:03 pm on 01 Jun
For the best experience use inshorts app on your smartphone