అరేబియా సముద్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు, బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో (ఈనెల 29 వరకు) కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు, రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ చెప్పింది.
short by
srikrishna /
07:58 am on
26 May