For the best experience use Mini app app on your smartphone
నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాము పోలీసుల కస్టడీకి విజయవాడ ఎక్సైజ్‌ కోర్టు అనుమతించింది. దీంతో జోగి రమేశ్‌, జోగి రామును 4 రోజుల పాటు ఎక్సైజ్‌ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 26 ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఏ18, ఏ19గా ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.
short by Devender Dapa / 10:32 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone