For the best experience use Mini app app on your smartphone
ముంబై నటి కాదంబరీ జత్వానీపై వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును 3 రోజులు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఆది, సోమ, మంగళవారాల్లో సీఐడీ అధికారులు ఆయన్ను కస్టడీకి తీసుకోనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏప్రిల్‌ 22న అరెస్టయిన పీఎస్‌ఆర్‌ ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
short by srikrishna / 02:46 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone