ప్రజలను రెచ్చగొట్టి నియోజకవర్గంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని ఎవరైనా పాడు చేస్తే ఊరుకునేది లేదని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. ‘’మంచిగా మాట్లాడితే నాలుగు ఓట్లు పడతాయి. అంతే గానీ మతాల గురించి మాట్లాడితే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు. నువ్వు డెంటల్ డాక్టర్ కాదు, మెంటల్ డాక్టర్వి,’’ అని సాయిప్రసాద్ రెడ్డి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
short by
M Srinu /
05:58 pm on
25 Apr