ప్రకాశం జిల్లాలో బెస్తవారిపేట మండలం పెద్ద ఓపినేనిపల్లిలో ఆరుబయట క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పశువుల కాపరి ఒకరు తీవ్రంగా గాయపడగా, అతడిని కంభంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకులను 17 ఏళ్ల గోషిపోతల ఆకాష్, 18 ఏళ్ల పులిగుజ్జు తన్నిగా గుర్తించారు. ఆదివారం సెలవురోజు కావడంతో యువకులు క్రికెట్ ఆడారు.
short by
Devender Dapa /
10:01 pm on
20 Apr