For the best experience use Mini app app on your smartphone
ప్రకాశం జిల్లాలో బెస్తవారిపేట మండలం పెద్ద ఓపినేనిపల్లిలో ఆరుబయట క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పశువుల కాపరి ఒకరు తీవ్రంగా గాయపడగా, అతడిని కంభంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకులను 17 ఏళ్ల గోషిపోతల ఆకాష్, 18 ఏళ్ల పులిగుజ్జు తన్నిగా గుర్తించారు. ఆదివారం సెలవురోజు కావడంతో యువకులు క్రికెట్ ఆడారు.
short by Devender Dapa / 10:01 pm on 20 Apr
For the best experience use inshorts app on your smartphone