నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో పదే పదే గొడవ పడుతోందని విజయ్ చంద్ర అనే వ్యక్తి తన భార్య అయిన శైలజను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ట్రెజరీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న విజయ్పై శైలజ అనుమానం పెంచుకుని వేధించేది. మానసికస్థితి సరిగా లేక ఇద్దరు కొడుకులతోనూ గొడవపడేది. శనివారం ఇంట్లో కుమారులు లేని సమయంలో మరోసారి గొడవ జరగ్గా కోపంలో భర్త రోకలిబండతో తలపై కొట్టడంతో భార్య స్పాట్లోనే చనిపోయింది.
short by
Devender Dapa /
05:07 pm on
15 Jun