For the best experience use Mini app app on your smartphone
కోనసీమ కొబ్బరికి దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ మాట్లాడటం బాధాకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘’ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడమే. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు,’’ అని షర్మిల పేర్కొన్నారు.
short by srikrishna / 04:48 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone