పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం నామినేషన్ వేశారు. ఆయన వెంట కడప ఎంపీ అవినాష్రెడ్డి ఉన్నారు. అంతకు ముందు పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఆయన పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు, ఈ స్థానంలో టీడీపీ తరఫున బీటెక్ రవి పోటీ చేస్తున్నారు.
short by
Sri Krishna /
12:51 pm on
25 Apr