సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు టీస్టాల్లో భూ దస్త్రాలపై సంతకాలు చేయడం విమర్శలకు దారి తీసింది. ఫిబ్రవరి 1 నుంచి భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో శుక్రవారమే క్రయ, విక్రయాలు పూర్తి చేయాలని చాలా మంది రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చారు. ఈ తరుణంలో సెలవులో ఉన్నట్లు శ్రీనివాసులు తన సిబ్బందికి చెప్పారు. ఆపై అర్జీదారులను హోటల్కు పిలిపించుకొని, అక్కడే దస్తావేజులపై సంతకాలు చేశారు.
short by
Bikshapathi Macherla /
08:47 am on
02 Feb