For the best experience use Mini app app on your smartphone
భూటాన్‌లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.1 గా నమోదైందని అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్ర లోతు 5 కి.మీ. అయితే మళ్లీ భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చారిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు భూటాన్‌లో భూ ప్రకంపనలు సంభవించగా, తాజాగా ప్రస్తుతం మరోసారి భూమి కంపించింది. భూటాన్ దేశం హిమాలయ ప్రాంతంలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తాయి.
short by / 08:37 am on 09 Oct
For the best experience use inshorts app on your smartphone