For the best experience use Mini app app on your smartphone
భారత్‌కి $93 మిలియన్ (రూ.823 కోట్లకు పైగా) విలువైన రెండు రకాల కీలక సైనిక పరికరాల అమ్మకానికి అమెరికా బుధవారం ఆమోదం తెలిపింది. భారత్‌కు జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఎక్సాలిబర్ ప్రొజెక్టైల్స్‌తో పాటు ఇతర సంబంధిత పరికరాలను అందిస్తామని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కో ఆపరేషన్ ఏజెన్సీ (DSCA) తెలిపింది. ప్రస్తుత, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేందుకు ఇండియా సామర్థ్యాన్ని ఈ ఒప్పందాలు మెరుగుపరుస్తాయని చెప్పింది.
short by / 09:15 am on 20 Nov
For the best experience use inshorts app on your smartphone