For the best experience use Mini app app on your smartphone
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బుధవారం భారత్‌పై 25% సుంకం విధించారు. దాంతో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది ఆగస్టు 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. "భారత్‌ మా మిత్రదేశమే అయినా మా వస్తువులపై ఎక్కువ సుంకాలు విధిస్తోంది. రష్యా నుంచి ఎక్కువగా సైనిక ఉత్పత్తులు కొంటోంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటోంది. ఇది సరికాదు," అని ట్రంప్ పేర్కొన్నారు.
short by Devender Dapa / 06:46 pm on 30 Jul
For the best experience use inshorts app on your smartphone