For the best experience use Mini app app on your smartphone
భద్రాద్రి రామాలయం ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార స్లోగన్‌లు ఉన్న బ్యాగ్‌లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు చెందిన కొందరు భక్తులు, ఈ షాపులో రెండు చీరలను కొనుగోలు చేశారు. అయితే షాపు నిర్వహకులు ఇచ్చిన సంచులపై అన్యమత ప్రచార స్లోగన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై తాము ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు భక్తులు తెలిపారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసినట్టు సమాచారం.
short by Devender Dapa / 11:25 pm on 01 Jun
For the best experience use inshorts app on your smartphone