For the best experience use Mini app app on your smartphone
బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ తన భర్త అయిన ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌పై ముంబై కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. అతడి వల్ల తన ఆదాయం, ఆస్తులను కోల్పోయినందుకు బదులుగా రూ.50 కోట్ల పరిహారం, నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని కోరింది. సెలీనా, పీటర్ 2011లో ఆస్ట్రియాలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2004లో వచ్చిన మంచు విష్ణు ‘సూర్యం’ సినిమాలోనూ సెలీనా హీరోయిన్‌గా నటించారు.
short by srikrishna / 02:50 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone