For the best experience use Mini app app on your smartphone
కౌతాళం మండలం కుంటనహాల్‌ గ్రామంలో శేకన్‌ అనే 32ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందవరం మండలం కనకవీడుకు చెందిన శేకన్‌, కుంటనహాల్‌కు చెందిన ఇలియాసాబ్‌కు 13ఏళ్ల క్రితం వివాహమైంది. శేకన్‌ తరచూ తన పుట్టింటికి వెళ్తుండటంతో, ఈ విషయంపై భర్త ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆ మనస్తాపంతో మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది.
short by M Srinu / 03:04 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone