కౌతాళం మండలం కుంటనహాల్ గ్రామంలో శేకన్ అనే 32ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందవరం మండలం కనకవీడుకు చెందిన శేకన్, కుంటనహాల్కు చెందిన ఇలియాసాబ్కు 13ఏళ్ల క్రితం వివాహమైంది. శేకన్ తరచూ తన పుట్టింటికి వెళ్తుండటంతో, ఈ విషయంపై భర్త ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆ మనస్తాపంతో మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది.
short by
M Srinu /
03:04 pm on
25 Apr