For the best experience use Mini app app on your smartphone
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డు(ORR)పై విశాఖ నుంచి మేడ్చల్ వెళ్తున్న ట్రక్కు ఢీకొని ఔటర్‌పై పనిచేస్తున్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. మృతులను ఒడిశాకు చెందిన 28 ఏళ్ల నారాయణ, 24 ఏళ్ల మోహన్‌, 32 ఏళ్ల జైరామ్‌గా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా కార్మికులు ORRపై కలుపు మొక్కలు తీసేందుకు వచ్చారు.
short by Devender Dapa / 10:54 pm on 11 Aug
For the best experience use inshorts app on your smartphone