మండల- మకరవిలక్కు పూజల కోసం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. వృశ్చిక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం నుంచి 41 రోజుల మండలం తీర్థయాత్ర మొదలు కానుంది. ఈ సీజన్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజుకు 90 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రోజుకు 70 వేల వర్చువల్ క్యూటోకెన్లు, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల టోకెన్లు జారీచేస్తారు.
short by
srikrishna /
08:26 am on
17 Nov