For the best experience use Mini app app on your smartphone
పార్వతీపురం మన్యం జిల్లాలోని జంఝావతి రబ్బరు డ్యామ్‌లో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివిని గ్రామానికి చెందిన శరత్‌, గోవింద్‌నాయుడు, ప్రదీప్‌ తమ బంధువులతో కలిసి రబ్బర్‌ డ్యామ్‌లో ఈతకు వెళ్లారు. తొలుత నీటిలోకి దిగి శరత్ ఈత రాక కొట్టుకుపోతుండగా, అతడిని కాపాడేందుకు దిగి గోవింద్, ప్రదీప్ కూడా కొట్టుకుపోయారు. వారు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.
short by Devender Dapa / 10:40 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone