హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జిప్లైన్ చేస్తుండగా మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన త్రిష బిజ్వే అనే 12 ఏళ్ల బాలిక 30 అడుగుల ఎత్తు నుంచి పడి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. మార్గమధ్యలో ఉండగా జిప్లైన్ తెగిపోవడంతో బాలిక భయంతో అరుస్తూ కింద ఉన్న రాళ్లమీద పడిపోయినట్లు వీడియోలో ఉంది. బాలిక కాలులో ఎముక విరిగిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
short by
Devender Dapa /
07:15 pm on
15 Jun