భారతీయ విమానయాన సంస్థలకు చెందిన సుమారు 30 విమానాలకు సోమ, మంగళవారాల్లో బాంబు బెదిరింపులు వచ్చినట్లు పలు నివేదికలు తెలిపాయి. అందులో ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా విమానాలు ఉన్నాయి. బెదిరింపులకు గురైన విమానాలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా గడిచిన వారంలో 120 విమానాలకు బూటకపు బెదిరింపులు వచ్చాయి.
short by
Devender Dapa /
05:10 pm on
22 Oct