For the best experience use Mini app app on your smartphone
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలంలో గురువారం అత్యధికంగా 44.2°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బనగానపల్లి, డోన్‌లో 44.1°C, కోడుమూరు 43.9°C, కర్నూలులో 43.1°C చొప్పున ఎండలు నమోదయ్యాయని చెప్పారు. రానున్న 2, 3 రోజుల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు 46°C-47°C మధ్య నమోదు కావచ్చని, మంత్రాలయం, కోడుమూరు, గూడూరు, దేవనకొండ, డోన్, చాగలమర్రి మండలాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
short by M Srinu / 08:05 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone