వెల్దుర్తి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ను తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టడంతో నరేష్ అనే 37ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. నరేష్ తన స్నేహితుడు రామాంజనేయులతో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన రామాంజనేయులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు నరేష్ విలేకరిగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.
short by
M Srinu /
01:59 pm on
25 Apr