For the best experience use Mini app app on your smartphone
వెల్దుర్తి సమీపంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బైక్‌ను తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టడంతో నరేష్‌ అనే 37ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. నరేష్‌ తన స్నేహితుడు రామాంజనేయులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన రామాంజనేయులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు నరేష్‌ విలేకరిగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.
short by M Srinu / 01:59 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone