For the best experience use Mini app app on your smartphone
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 60 ఏళ్ల రామసాహు ఆదివారం క్యూ లైన్‌లో అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే కొండపైన ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఘటనలో, గుట్ట కింద గల లక్ష్మీ పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఏడేళ్ల బాలిక ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయింది.
short by srikrishna / 08:36 am on 26 May
For the best experience use inshorts app on your smartphone