For the best experience use Mini app app on your smartphone
ఏపీ సీఆర్డీఏ సమావేశంలో అమరావతి రైతులు, రాజ్‌ భవన్‌ నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో భాగంగా రూ.212 కోట్లతో రాజ్‌ భవన్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రాజ్ భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సీఎం సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు.
short by / 11:17 am on 09 Oct
For the best experience use inshorts app on your smartphone