For the best experience use Mini app app on your smartphone
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు గమనించి, తాను బయటకు దిగిపోయినట్లు ఈ ఘటన జరిగినపుడు డ్రైవింగ్ చేస్తున్న యజమాని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు.
short by Devender Dapa / 10:58 pm on 27 Mar
For the best experience use inshorts app on your smartphone