For the best experience use Mini app app on your smartphone
రాజంపేట అడవుల నుంచి చెన్నైకి ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను పుంగనూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 20 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తమిళనాడు క్రిష్ణగిరి సెంట్రల్ జైలులో కలిసిన నలుగురు నేరస్తులు ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, వీరికి ముందు మార్గం చూపుతూ బైక్‌లపై వెళ్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
short by / 01:09 pm on 15 Sep
For the best experience use inshorts app on your smartphone