అయోధ్యలోని బాలరాముడి గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని పీఎం నరేంద్ర మోదీ ఎగురవేశారు. రామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ జెండా కాషాయవర్ణంలో 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.
short by
srikrishna /
12:15 pm on
25 Nov