కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్ల పవర్స్కామ్కు తెరలేపిందని, ఇందులో పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30, 40% కమీషన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ‘‘రేవంత్ ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమీషన్. కమీషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే ఆయన ప్రభుత్వం ఆలోచిస్తోంది,’’ అని హరీశ్ చెప్పారు. వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని తెలిపారు.
short by
Srinu /
05:25 pm on
26 Nov