జగిత్యాల జిల్లా కోరుట్లలోని బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలోని విగ్రహాలను మరో ప్రాంతానికి తరలిస్తుండగా కరెంట్ తీగలు తగిలి విద్యుత్ షాక్తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విగ్రహాలను తరలిస్తున్నపుడు స్ట్రీట్లైన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. మృతులను సాయి, వినోద్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రి తరలించారు.
short by
Devender Dapa /
06:05 pm on
15 Jun