For the best experience use Mini app app on your smartphone
తెలంగాణలో వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై సచివాలయంలో పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటరు జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
short by Bikshapathi Macherla / 08:37 pm on 26 Jul
For the best experience use inshorts app on your smartphone