For the best experience use Mini app app on your smartphone
కోడుమూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్ పరిధిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఆ శాఖ అధికారులు గురువారం వేలం వేశారు. మొత్తం 3 మోటార్ సైకిళ్లు, 5 మోపెడ్ వాహనాలను వేలం వేయగా రూ.33,158 ఆదాయం సమకూరిందని సెబ్‌ సీఐ రామాంజనేయులు తెలిపారు. అనంతరం అవసరమైన వాహనాల పత్రాలను కొనుగోలుదారులకు అందజేశామని ఆయన చెప్పారు.
short by M Srinu / 06:47 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone