కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 9వ వార్డు మరాఠి గేరి కౌన్సిలర్ పద్మ గురువారం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం పలువురు నాయకుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తానని పద్మ చెప్పారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.
short by
M Srinu /
10:18 pm on
25 Apr