For the best experience use Mini app app on your smartphone
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఐరన్ బాక్స్‌లో తరలిస్తున్న రూ.1.55కోట్ల విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడి లగేజి తనిఖీ చేయగా ఐరన్ బాక్సులో 11 గోల్డ్ బార్‌లు బయటపడ్డాయి. పట్టుబడ్డ బంగారం 1196.20 గ్రాములు ఉందని అధికారులు తెలిపారు.
short by Devender Dapa / 11:22 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone