For the best experience use Mini app app on your smartphone
నాసిక్-త్రయంబకేశ్వర్‌లో జరిగే సింహస్థ కుంభమేళా 2026 అక్టోబర్ 31న ధ్వజారోహణంతో ప్రారంభమవుతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తెలిపారు. మొదటి అమృత స్నానం ఆగస్టు 2, 2027న సోమవతి అమావాస్య నాడు జరుగుతుందని చెప్పారు. 2, 3 అమృత స్నానాలను అదే ఏడాది వరుసగా ఆగస్టు 31, సెప్టెంబర్ 11 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. కుంభమేళా జెండాను 2028 జూలై 24న అవనతం చేస్తారు.
short by / 12:44 am on 02 Jun
For the best experience use inshorts app on your smartphone