For the best experience use Mini app app on your smartphone
రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ సెంచరీ, మాథ్యూ బ్రీట్జ్‌ కే, డెవాల్డ్ బ్రెవిస్ అర్ధ సెంచరీలతో రాణించడంతో దక్షిణాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌పై సంయుక్తంగా అతిపెద్ద వన్డే పరుగుల ఛేజింగ్‌ను నమోదు చేసింది. 2025లో స్వదేశంలో వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇది తొలి ఓటమి.
short by Devender Dapa / 10:43 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone