For the best experience use Mini app app on your smartphone
సౌదీ అరేబియాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ నల్లకుంటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 65ఏళ్ల నజీరుద్దీన్‌ సహా అతడి కుటుంబంలోని 18 మంది చనిపోయారు. మృతుల్లో ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారులు, కోడళ్లు, వారి పిల్లలు ఉన్నారు. వీరంతా మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తుండగా బస్సు-డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 45 మంది చనిపోగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.
short by Srinu / 06:13 pm on 17 Nov
For the best experience use inshorts app on your smartphone