For the best experience use Mini app app on your smartphone
సిద్దిపేట జిల్లా పెద్దచెప్యాలలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టిన ఘటనలో 3 నెలల క్రితం పెళ్లయిన ప్రణతి అనే 24 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆమె భర్త సాయి కిరణ్‌కు గాయాలు అయ్యాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసే ఈ దంపతులు, సిద్దిపేటలో ఓ ఫంక్షన్‌కు హాజరై హైదరాబాద్‌కు వెళ్తుండగా.. ట్రాక్టర్ వేగంగా వెనకనుంచి వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. సాయికుమార్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
short by Devender Dapa / 10:18 pm on 25 Nov
For the best experience use inshorts app on your smartphone