For the best experience use Mini app app on your smartphone
ఆదివారం జరిగిన T20 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏ ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా స్లెడ్జింగ్‌కు ఇండియా ఏ జట్టు ఓపెనర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కౌంటర్ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ.. 'వెళ్లి బౌలింగ్ చెయ్‌' అని బౌలర్‌కు చెప్పినట్లు వినిపించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు.
short by / 11:04 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone