ముంబయిలోని సల్మాన్ఖాన్ ఇంటి బయట ఇటీవల జరిగిన కాల్పుల ఘటనతో సంబంధమున్న పంజాబ్కు చెందిన సోను సుభాష్ చందర్, అనుజ్ థాపన్ అనే ఇద్దరిని ముంబయి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరికి బిష్ణోయ్ గ్యాంగ్తో పరిచయం ఉంది. వీరే ఈ కేసులో ఇద్దరు నిందితులకు తుపాకీలను సరఫరా చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్లను ఈ కేసులో వాంటెడ్గా పోలీసులు ప్రకటించారు.
short by
Sri Krishna /
08:31 pm on
25 Apr