For the best experience use Mini app app on your smartphone
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం 29 ఏళ్ల బత్తుల ప్రభాకర్‌ జరిపిన కాల్పుల్లో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకూ చోరీ కేసులున్నాయి. 2022 మార్చిలో విచారణ నిమిత్తం పోలీసులు అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో అతను తప్పించుకుపోయి, అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడు ఎక్కువగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చోరీలు చేస్తుంటాడు.
short by Sri Krishna / 12:04 pm on 02 Feb
For the best experience use inshorts app on your smartphone